మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…

మెదక్ జిల్లా, మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు అనగా తేదీ 20-04-2024 నాడు న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ విజయవంతంగా దాఖలు చేశారు.ఈ సందర్భంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో మాట్లాడుతూ స్వాతంత్రం సాధించుకొని 75 సంవత్సరాలు గడిచినా కూడా రాష్ట్రాలకు అప్పు పెరిగిపోతుందే గాని ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదని, స్వాతంత్ర సమరయోధులు కలలు కన్న రాజ్య స్థాపన కోసం , ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మెదక్ పార్లమెంట్ లోని నర్సాపూర్, మెదక్ ,సంగారెడ్డి ,పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్ , సిద్దిపేట్ ప్రతి నియోజకవర్గంలో ప్రచారం చేసి ప్రజల ఆశీర్వాదం పొంది , ప్రజా బలంతో మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం ఖాయమని ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలు మార్పు కోరుకుంటూ కొత్త నాంది పలుకుతారని తెలియజేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా వై శ్రీనివాస్ గౌడ్, డాకూర్ సుధాకర్, వై విగ్నేష్ గౌడ్, కోవారి శ్రీనివాస్ గౌడ్ మరియు మెదక్ పార్లమెంట్ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *