తొలిదశ లోక్ సభ ఎన్నికలు.. ఓటర్లకు ప్రధాని మోదీ సందేశం..

దేశంలో నేడు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ స్థానాలతో పాటు.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. ఓటర్లు పోలింగ్ బూత్ లకు చేరుకుని ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. తొలిదశ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఓటర్లనుద్దేశించి సందేశాన్ని పంపారు.

 

ప్రజలు, ముఖ్యంగా యువ ఓటర్లు, తొలిసారిగా ఓటు హక్కు పొందినవారు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన పలు భాషల్లో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రతీ ఓటు, ప్రతీ గొంతు ఎన్నికల్లో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు.

 

 

“2024 లోక్‌సభ ఎన్నికలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున, ఈ స్థానాల్లో ఓటు వేసే వారందరూ తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. యువకులు, మొదటిసారి ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయాలని నేను ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాను. అన్నింటికంటే.. ప్రతి ఓటు లెక్కించబడుతుంది.” అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *