పింఛన్ల పంపిణీపై కుట్రలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘పింఛన్ల పంపిణఈ బాధ్యతను సీఎం సరిగ్గా నిర్వహించట్లేదు. వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పింఛన్ల పంపిణీపై కుట్రలు చేస్తున్నారు. వాలంటీర్లతో నగదు పంపిణీ బాధ్యతలను ఈసీ తప్పించింది. ప్రభుత్వ ఉద్యోగులతో ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వాలని ఈసీ చెప్పింది.