నేటి నుంచి జనసేనాని వారాహి యాత్ర..

నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్ర పేరిట ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం గం.12.30 నిమిషాలకు పిఠాపురం చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ కొలువై ఉన్న శక్తి పీఠం పురుహుతికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ వర్మతో భేటీ కానున్నారు. సా. 4 గంటలకు చేబ్రోలు, రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయభేరీ సభలో పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *