కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. కేంద్ర ఆర్థికశాఖ గురువారం ఈ వివరాలను వెల్లడించింది. ఈ రుణభారంలో 25.9 శాతాన్ని రానున్న ఐదేళ్లలో తీర్చాల్సి ఉంటుంది.