మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం..

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 1,439 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 10 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి కొడంగల్‌లో, మంత్రి జూపల్లి కృష్ణారవు కొల్లాపూర్‌లో ఓటేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *