బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌పై కేసు నమోదు..

బీఆర్ఎస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారా హిల్స్ రోడ్. నెం. 14లో భూకబ్జాకు యత్నించారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మాజీ ఎంపీ సంతోష్‌తో పాటు లింగారెడ్డి శ్రీధర్‌పై కేసు నమోదు చేశారు.

 

129/54 సర్వే నెం. లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ కంపెనీ కొనుగోలు చేసింది. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నిస్తున్నారని చింతా మాధవ్ ఈ నెల 21న ఫిర్యాదు చేశారు. ఐపీసీ 400, 471, 447, 120బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *