ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు చెబితేనే చేశామని ప్రణీత్‌, భుజంగరావు, తిరుపతన్న తెలిపారు. 7 రోజుల విచారణలో ప్రణీత్‌రావు కీలక విషయాలు బయటపెట్టారు. 36 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులు, ప్రముఖ జ్యుయలరీ వ్యాపారులు, హవాలా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి, మాజీ మంత్రుల అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి చెదిరించినట్లు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *