రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ముఖ్య నేతలతో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రచార షెడ్యూల్, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల అంశాలపై చర్చించారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. బహిరంగ సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు..