టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారు కాగా, ఈ నెల 17న చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీలు నిర్ణయించాయి. పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికల సభ కావడంతో మూడు పార్టీలూ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. ఈ ఉమ్మడి సభా వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.