నేడు కరీంనగర్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ..

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ సమరశంఖం పూరిస్తోంది. మంగళవారం సాయంత్రం కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కళాశాల మైదానంలో దాదాపు లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. తమకు కలిసొచ్చిన గడ్డ నుంచే మొదటి సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ కదనభేరికి లక్ష మందిని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాటి చెప్పాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *