బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఇవాళ జరుగనుంది. ఈ నేపథ్యంలో రెండో విడతలో అభ్యర్థుల జాబితా నేడు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీలోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో లోక్సభ బరిలో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్ బీజేపీలో చేరారు. దీంతో వీరికి టికెట్స్ దక్కే ఛాన్స్ ఉంది.