ఆసక్తికర పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్..

కేరళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజా చిత్రం ‘ఆడుజీవితం’ ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ ట్రైలర్‌పై గ్లోబల్ స్టార్ ప్రభాస్ రియాక్ట్ అయ్యారు. “నేను చూస్తుంది వరదరాజ మన్నార్‌గా నటించిన వ్యక్తినా! ఇది నేను నమ్మలేకపోతున్నాను. పృథ్వీ మీరు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను.” అంటూ పోస్ట్ చేశారు. దీనికి ‘ధన్యవాదాలు దేవా.. త్వరలోనే యుద్ధభూమిలో కలుద్దాం’ అంటూ పృథ్వీరాజ్ రిప్లై ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *