ఇవాళ మ.3 గంటల నుంచి సా.5 గంటల వరకు బాపట్లలో ‘సిద్ధం’ సభ జరుగనుంది. ఈ సభలో వైసీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో తుదిదశకు చేరుకుంది. ఈ సభలో జగన్ ఎన్నికల వరాలు కురుపించనున్నట్లు వైసీపీ వర్గీయులు చెబుతున్నారు. దాంతో ఎన్నికల మేనిఫెస్టోపై ఉత్కంఠ నెలకొంది.