రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ కు క్రిష్ ఊరట లభించింది. ఇటీవల గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీలో క్రిష్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్, చరణ్లకు మూత్ర పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. కోర్టు అనుమతితో పోలీసులు వీరిద్దరి నుంచి రక్తనమూనాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపించగా, రిపోర్టు వచ్చిన తర్వాత దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.