లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కానున్నారు. ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి నేతలతో చర్చించనున్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించకుంటే ఆ పార్టీ మనుగడపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు.