రాడిసన్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని రిమాండ్కు తరలించగా ఏ9 నిందితుడు, ‘సైంధవ్’ నిర్మాత వెంకట్ బోయినపల్లి కొడుకు నీల్ విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉండటంతో అక్కడికే వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. నీల్ కొకైన్ తీసుకున్నట్లు అనుమానితుల జాబితాలో చేర్చారు. ఈ కేసులో మరో అనుమానితుడు డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్కు హైకోర్టులో దరఖాస్తు చేశారు.