మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో నలుగురు మృతి..

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధితో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర కన్నడ జిల్లాలో 60 ఏళ్ల వృద్ధురాలు 20 రోజులుగా మంకీ ఫీవర్ తో బాధపడుతూ ఆదివారం ఓ మహిళా మృతి చెందింది. దీంతో కర్ణాటకలో ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నెల 25లోపు 5000 మందికి పరీక్షలు నిర్వహించగా 120 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ వ్యాధి సోకినవారికి 3-8 రోజుల తరువాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పి వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *