తెరుచుకున్న ఢిల్లీ- హర్యానా సరిహద్దులు..

‘ఢిల్లీ చలో’ మార్చ్ నిరసన ర్యాలీకి రైతు సంఘాలు తాత్కాలిక విరామం ప్రకటించడంతో ఢిల్లీలో ట్రాఫిక్‌కు కాస్త ఉపశమనం కలుగుతోంది.

పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు రెండో విడత ఢిల్లీ చలో చేపట్టిన దీక్షకు ఈ నెల 29 వరకు విరామం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ-హర్యానా మధ్య సింగు, టిక్రీ సరిహద్దులను పోలీసులు సోమవారం తెరిచారు. ఈ సరిహద్దులను తెరవడం వల్ల వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *