రూ.500కే సిలిండర్ పథకానికి రూ.80 కోట్ల నిధులు..

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రూ.80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500 సిలిండర్‌ పథకాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. సిలిండర్ కు మొత్తం ధర చెల్లిస్తే.. రూ.500 పోను మిగతా నగదు లబ్దిదారుల ఖాతాలో సబ్సిడీ రూపంలో జమ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *