మాస్ మహారాజా రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ సంస్థతో కలిసి ఆయన హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఏషియన్ రవితేజ(ఏఆర్టీ) పేరుతో మల్టీప్లెక్స్ను ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఏషియన్ గ్రూప్తో కలిసి మహేశ్ బాబు(ఏఎంబీ), అల్లుఅర్జున్(ఏఏఏ), విజయ్ దేవరకొండ(ఏవీడీ) మల్టీప్లెక్స్ బిజినెస్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.