రెండో విడత ఎన్నికలకు భారీ బందోబస్తు……

ఆసిఫాబాద్ : రెండవ విడతలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ మల్లారెడ్డి వెల్లడించారు. పోలీస్ సిబ్బందితో ఎస్పీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలోని 600 మంది సిబ్బందితోపాటు బయటి నుంచి మరో 100 మంది కలిపి మొత్తం 700 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఆరుగురు సిఐలు,12 మంది ఎస్ఐలు, 60 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు,180 మంది సివిల్ కానిస్టేబుల్స్, 80 మంది సాయుధ కానిస్టేబుల్స్,100 మంది ఫారెస్ట్ ఆఫీసర్స్, 100 మంది హోంగార్డ్స్, 3 స్పెషల్ పార్టీలు, 3 బాంబ్ డిస్పోసల్ టీంలు, 31 మొబైల్ పార్టీలు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఆరుగురు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ , ఎస్పీ రిజర్వ్ పార్టీలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు……


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *