ఆటో డ్రైవర్‌ హత్యకేసులో ఐదుగురి అరెస్టు….

హైదరాబాద్‌: పహాడీ షరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఆటో డ్రైవర్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను దక్షిణ మండల టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. నిందితుల్లో షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ అమీర్‌, అహ్మద్‌ అలీఖాన్‌, మహ్మద్‌ అబ్దుల్‌ సమీర్‌తో పాటు ఓ బాల నేరస్థుడు ఉన్నట్టు ఆయన తెలిపారు. నిందితుల నుంచి కత్తి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు. పహాడీ షరీఫ్‌ పరిధిలో ఈ నెల 1న వ్యక్తి హత్య జరగ్గా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో ఆటో దగ్ధం కేసు.. గోపన్నపల్లిలో వ్యక్తి తప్పిపోయిన కేసును పరిశీలించిన పోలీసులు ఘటనలన్నింటికీ సంబంధం ఉందని తేల్చారు. ఆటో కిరాయి చెల్లించే క్రమంలో ఆటో డ్రైవర్‌ సాయినాథ్‌కు, నిందితులకు వివాదం తలెత్తిందని, మాటామాటా పెరగడంతో సాయినాథ్‌ను కత్తితో పొడిచి చంపారని సీపీ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *