మహేశ్- రాజమౌళి సినిమా.. కథ చెప్పేసిన విజయేంద్ర ప్రశాద్..!..

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే నెక్స్ట్ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆయన ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ ప్రపంచం మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో తీస్తున్నట్లు ప్రటించారు. ఫుల్ యాక్షన్ అండ్ అడ్వంచర్‌తో కూడిన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. దీంతో మహేశ్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 

మహేశ్ ముఖ్యంగా ఈ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసినట్లు ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రశాద్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విశేషాలని అతడు పంచుకున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రశాద్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని తెలుపుతూ.. మరింత హైప్ పెంచేశారు.

 

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్ – రాజమౌళి సినిమా ‘ఇండియానా జోన్స్’లా ఉంటుందని అన్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని చెప్పారు. ఈ సినిమా ఎక్కువగా అడవి నేపథ్యంలోనే సాగుతుందని తెలిపారు. అలాగే ఈ సినిమా సంగీతం గురించి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయన మాటలతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *