హైదరాబాద్ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం లో అఖండ విజయం సాధించిన భాజపా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వైసిపి కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్ట్రర్స్ అస్సోసియేషన్ చైర్మన్ సుధాకర్ అభినందనలు తెలియజేసారు . ప్రజాస్వామ్యంలో లో పాత్రికేయ వ్యవస్థ కీలకమైనటువంటిదని , అలంటి పాత్రికేయ మిత్రులు పాత్రికేయ వృత్తిని ఊపిరిగా భావిస్తున్నారని , తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమ సమాజ స్థాపన కోసం తమ వంతు కృషి చేస్తూ రెక్కాడితే డొక్కాడని స్థితిలో జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వాల నుండి నామ మాత్రపు చేయుత లభిస్తుంది . అలాంటి పాత్రికేయ కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల దృక్పధంతో అలోచించి సహాయపడగలరని ఆశిస్తున్నట్లు సుధాకర్ తెలిపారు .