సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం సోమవారం తుది ఓటర్ల జాబితా–2024 విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ కానున్న ఏపీ సీఈఓ ఎంకే మీనా భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవ్వనున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితా అందజేయనున్నారు.