పేరుకె ప్రభుత్వ చలివేంద్రం – చుక్క నీరు లేదు



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం బయట ఏర్పాటు చేసిన చాలివేంద్రం పేరుకు చాలివేంద్రం కానీ అందులో మంచినీరు లేక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు అవస్థలు పడుతున్నారు. మండలకేంద్రం నికి వచ్చిన ప్రజలకు దాహార్థిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకున్న అధికారులు పట్టించుకోవడం లేదు . చలివేంద్రం ప్రారంభించేటప్పుడు పత్రికలవారికి ఫోటోలకు ఫోజులివ్వడానికి మాత్రం ఫోజులిచ్చి ప్రారంభించారు . కానీ ఇప్పుడు చలివేంద్రాన్ని పట్టించుకునే నాధుడే లేడు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రజల దాహం తీర్చలని వివిధ గ్రామ ప్రజలు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *