యువకుడ్ని ఢీకొట్టి… పట్టించుకోకుండా వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యే

ఈరోజు ఉదయం నిడమర్రు దగ్గర ఉన్న బాపూజీ నగర్ నుంచి బైక్‌పై వస్తుండగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని కారు నవీన్‌ను ఢీకొట్టింది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.


వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందుకే ఆమె చేసిన నిర్వాకమే కారణం. అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యే కారు…దారిలో బైక్ పై వస్తున్న ఓ యువకుడ్ని ఢీకొట్టింది. అతివేగంతో వస్తున్న ఎమ్మెల్యే కారు ఒక్కసారిగా బైక్‌ను ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న నవీన్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే కనీసం కారు దిగి బాధితుడ్ని పట్టించుకోకుండానే.. ఆటోలో అసెంబ్లీకి వెళ్లిపోయారు ఎమ్మెల్యే రజనీ. ఆమె గన్ మెన్లు కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించి నవీన్‌ను ఆస్పత్రికి తరలించారు. నిడమర్రు రోడ్డు బాపూజీ నగర్ చార్వాక ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. నవీన్ ఇంటర్ వరకు చదివాడు.తల్లిదండ్రులు లేకపోవడంతో అతడు కూలీ పని చేసుకొని బతుకుతున్నాడు. ఈరోజు ఉదయం నిడమర్రు దగ్గర ఉన్న బాపూజీ నగర్ నుంచి బైక్‌పై వస్తుండగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని కారు నవీన్‌ను ఢీకొట్టింది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నవీన్ పరిస్థితి క్రిటికల్ గా ఉందంటున్నారు డాక్టర్లు. ఎన్నారై ఆస్పత్రిలో నవీన్‌కు చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *