ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు “రెడ్ బుక్” హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా రెడ్ బుక్ ను తెరపైకి తీసుకుని వచ్చారు. ఈ రెడ్ బుక్ లో వైసీపీ ప్రభుత్వంలో రూల్స్ పాటించకుండా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారుల పేర్లను నోట్ చేశామని నారా లోకేష్ పలు సందర్భాలలో చెబుతూ వస్తున్నారు. దీంతో దొంగ ఓట్ల తొలగింపుతో పాటు రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్న నారా లోకేష్ పై చర్యలు తీసుకోవాలని మంగళవారం వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది