కరోనా వైరస్ నియంత్రణకు ప్రకటించిన లాక్డౌన్ను ఏప్రిల్ 15న రాష్ట్రంలో ఎత్తేసే అవకాశం అసలు లేదని సీఎం స్పష్టం చేశారు. ‘నలుగురితో నారాయణ మనం. మనది చాలా పెద్ద దేశం. అంతా మంచిగుందని అనుకున్న తర్వాత ఒకరికి వైరస్ వస్తే పరిస్థితి ఏంటి? మళ్లీ అంటుకొనే ప్రమాదం ఉంటది. ముందు రాష్ట్రం, తర్వాత దేశం స్థిమిత పడాలి. ఆ విషయాన్ని మన వైద్య నిపుణులు చెబు తరు. ఈ విపత్కర పరిస్థితి నుంచి తొందరగా బయటపడాలని అందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థిస్తున్న. బయటపడే వరకు నియంత్రణ పాటించాలి. మనకు మరో గత్యంతరం లేదు’ అని ఏప్రిల్ 15న లాక్డౌన్ ఎత్తి వేసేందుకు ఉన్న అవకాశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.