రాష్ట్రంలో అనారోగ్యంతో ఉన్న వారికి లాక్ డౌన్ విధులు అప్పగించవద్దని పోలీస్ అధికారులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అదివారం రాత్రి ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయిలో 55 సంవత్సరాలు పైబడిన పోలీస్ సిబ్బందికి లాక్ డౌన్ డ్యూటీ వేయొద్దని ఆదేశించారు. హృద్రోగ, శ్వాస, మధుమేహం వంటి సమస్యలతో ఉన్నవారిని క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంచాలన్నారు. అటువంటి వారికి పోలీస్ స్టేషన్, ఆఫీస్, కంట్రోల్ రూంలలో మాత్రమే విధులు కేటాయించాలని చెప్పారు.