ఐనవోలు లింగమోరిగూడెం గ్రామ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మహమ్మద్ సోనీ – గుళ్లు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు

తేది :18-02-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని లింగమోరిగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ సోని – గుళ్లు దంపతులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం నుంచి కేటాయించిన ₹5 లక్షల ఆర్థిక సహాయంతో తమ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ నివాసానికి బుధవారం రోజున కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యతిధిగా పాల్గొని గృహ ప్రవేశం చేసి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు.అనంతరం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసిన మహమ్మద్ సోని – గుళ్లు గారికి నూతన వస్త్రాలు పెట్టి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ద్వేయం” అని పేర్కొన్నారు..గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అని చెప్పి పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు నిజమైన న్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది పేదలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే నాగరాజు ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *