తేది:14-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
మెదక్ జిల్లా : టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటనను పోలీసులు వేగంగా ఛేదించారు. తంప్లూర్ గ్రామానికి చెందిన మహిళ మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు గొలుసును అపహరించిన నిందితులు పాపయ్య, పోచయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు మరియు స్థానిక సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. క్షుణ్ణమైన విచారణ అనంతరం నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి అపహరించిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల తక్షణ చర్యపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా అత్యవసర నంబర్ 100కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని, ఒంటరిగా ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.