యువగళం 3 వేల కిలోమీటర్లు…

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌.. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. అలానే టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

 

కాగా జనవరి 27న కుప్పంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. కాగా ఇప్పటి వరకు పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగింది. అయితే సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజులపాటు బ్రేక్ పడింది. ఇక రీసెంట్ గానే చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో గత నెల 26న యాత్ర పునఃప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *