నాదెండ్ల అరెస్టుపై పవన్ ఆగ్రహం.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్..

జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌‌ను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. నాదెండ్ల మనోహర్‌ అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. మనోహర్‌తో పాటు అరెస్టు చేసిన మిగతా వారందరినీ వెంటనే విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. విడుదల చేయకపోతే తాను స్వయంగా వచ్చి విశాఖలో పోరాటం చేస్తానని హెచ్చరించారు.

 

విశాఖపట్నంలోని టైకూన్ జంక్షన్ నుంచి విఐపి రోడ్డు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేశారు. దీనిపై జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన మొదలుపెట్టారు. వారికి మద్దతు తెలిపేందుకు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ నాదేండ్ల మనోహర్ బయలుదేరుతుండగా.. ఆయనను నోవోటెల్ హోటల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాదెండ్ల మనోహర్ హోటల్ గేటు వద్ద కూర్చుని నిరసన చేశారు. ఆ తరువాత పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *