వారికి ఉచిత విద్యుత్.. కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ, నేతన్నల చిరకాల కోరికైన ఉచిత విద్యుత్ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారు. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ పథకం అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది నేతన్నల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి.

 

నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. దీనివల్ల సుమారు 93,000 కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. దీని ద్వారా 10,534 కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ. 190 కోట్ల అదనపు భారాన్ని భరించనుంది.

 

గత కొన్నేళ్లుగా విద్యుత్ ఛార్జీల భారంతో కునారిల్లుతున్న చేనేత రంగానికి ఈ పథకం గొప్ప ఊపిరి పోయనుంది. కేవలం ఉచిత విద్యుత్తు మాత్రమే కాకుండా, చేనేత వస్త్రాలపై జీఎస్టీ (GST) భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని, అలాగే నేతన్న భరోసా కింద ఏటా రూ. 25,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వృత్తిని నమ్ముకున్న నేతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *