తేది:13-01-2026 TSLAWNEWS నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ కేశపురం సుమన్.
నిజామాబాద్ జిల్లా,వేల్పూర్: వరద కాలువకు కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు వచ్చేలా కృషి చేసి సుమారు 2500 ఎకరాల పంటను కాపాడినందుకు మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ని వేల్పూర్ లోని అయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన కమ్మర్పల్లి, తిమ్మాపూర్, పాలెం, మోర్తాడ్ గ్రామాల రైతులు.
ఈ సందర్బంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి SRSP పునరుజీవ పథకం ద్వారా వరద కాలువలోకి నీళ్లు తీసుకోచ్చి రైతుల పంటపొలాలకు సాగు నీళ్లు రావడానికి కారణమైన కేసీఆర్ కు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యేవేముల ప్రశాంత్ రెడ్డి.