తేది:13-01-2026 TSLAWNWES వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా: మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లాలో VB- G RAM- G చట్టం పై కొత్తవాడ SSK సమాజ్ హాల్ లో ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ మల్లాడి తిరుపతిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ. వికసిత్ భారత్ పేరుతో మోదీ పేద ప్రజలను ఆదుకోవడం లక్ష్యంగానే ఈ VB- G RAM- G ఉపాధి హామీ పథకం మార్పు చేయడం జరిగింది.
వ్యవసాయానికి బాసటగా ఉండేలా ఈ పధకాన్ని మార్పు చేసిన ఘనత మోదీ గారిది. ప్రపంచ దేశాలతో పోటీ పడి పని చేయాలి అంటే మార్పు అవసరం.అన్ని రంగాలలో భారత్ అభివృద్ధి చెందాలి.అందులో పేదలకు ఉపాధి హామీ పథకాన్ని వారి ఎదుగుదలకు ఉయోగాడెలా రూపొందించారు.
గతంలో ఉపాధి హామీ నిధులు దారి మల్లించి అవినీతికీ ఆస్కారం ఉండేలా కాంగ్రెస్ పొందుపరిచారు.
ఇప్పుడు మోదీ ప్రభుత్వం ప్రతి పైసా పేదలకు చేరేలాగా అకౌంటబిలిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.