తేది: 5- 1- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశానుసారం సోమవారం నేషనల్ రోడ్ సేఫ్టీ లో భాగంగా అల్లాదుర్గం నేషనల్ హైవే అండర్ పాస్ వద్ద వాహనదారులకు సీఐ రేణుక రెడ్డి రోడ్డు భద్రత అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని రాంగ్ రూట్లో ప్రయాణం ప్రమాదకరమని రాంగ్ రూట్లో ప్రయాణించరాదని తెలిపారు. హెల్మెట్ ధరించిన వారికి శాలువాతో సత్కరించి ప్రతి ఒక్కరు ఎలిమెంట్ ధరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ శంకర్, రేగోడ్ ఎస్సై పోచయ్య పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.