తేది:3-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా : భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో TNGO భవన్ మెదక్ లో మహిళా ఉపాధ్యాయురాళ్లకు, అంగన్వాడీ టీచర్లకు ఆశ వర్కర్లకు, ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు భార్యాభర్తలు మహాత్మా జ్యోతి భా పూలే, సావిత్రి బాయి పూలే ఇద్దరు కూడా అప్పటి సమాజంలో ఉన్నటువంటి నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని సతీసహగమనం, అంటారని తనం నిర్మూలనకు మహిళల చదువు ఒకటే మార్గమని ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎన్ని అవమానాలు సమాజానికి తమ జీవితాలను త్యాగం చేసి ఆదర్శ దంపతులుగా చరిత్ర లో నిలిచినారని కొనియాడం జరిగింది.ఈ కార్యక్రమం లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి గుండు మల్లేశం,గౌరవ అధ్యక్షులు గంగారాం, రాష్ట్ర వంజరి సెక్రటరీ బొల్లారం రమేష్,వర్కింగ్ ప్రెసిడెంట్ బీమారి శ్రీనివాస్, RTC BC రిటైర్డ్ ఎంప్లాయ్ శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్,స్వామి నాయి, HRF షేక్ హైమద్,MRPS బాలరాజు,మాజీ ఎంపీపీ అరుణ, HRF PRAO ముక్తా బాయి, NPRD శ్రీదేవి, సాప రవి, అనిల్,భూపతి యాదవ్, బాల్ రాజు యాదవ్, సాయిలు,లాలయ్య, రామస్వామి పాల్గొన్నారు