తేది:2-1-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా : మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ నేరాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు రోజువారీగా ఎదుర్కొంటున్న సైబర్ మోసాలపై ముఖ్యమైన సూచనలు అందించారు.
ప్రత్యేకంగా APK ఫైల్లు, అనధికారిక లోన్ యాప్లు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా జరుగుతున్న మోసాలు గురించి హెచ్చరించారు. ఇటువంటి యాప్లు మొబైల్లో డౌన్లోడ్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు.
అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని, తెలియని సోర్స్ల నుంచి వచ్చే యాప్లను డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. అలాగే ఓటీపీలు, పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలను ఎవరికీ తెలియజేయరాదని స్పష్టం చేశారు.
సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని జిల్లా పోలీసులు సూచించారు.
ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాల నివారణకు ప్రధాన ఆయుధమని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.