DEC 19న ఐపీఎల్ మినీ వేలం..

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫాలోయింగ్ ఉన్న ఐపీఎల్ మరో ఎడిషన్‌కి సిద్ధమైంది. ఈ క్రమంలో డిసెంబర్ 19న దుబాయ్‌లో మినీ వేలం నిర్వహించనున్నారు. దీంతో వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితా సిద్ధమైంది. మొత్తం 590 మంది స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు ఇందులో పాల్గొననున్నారు. ఇటీవల ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్, గెరాల్డ్ కొయెట్టీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, దిల్షాన్ మధుశంక తదితరులు భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *