
తేది:17-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
రేపటి నుంచి ఈ నెల 31వరకు ఇంటింటా సర్వే చేపడుతామని
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ అన్నారు. జిల్లా కుష్టు నివారణాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ తో కలిసి జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టు నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందనీ ఇందుకోసం వ్యాధిని తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు .ఇందుకోసం ఈనెల 18 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటా రెండోవిడత సర్వేకు శ్రీకారం చుట్టింది. ఏటా రెండుసార్లు సర్వే నిర్వహిస్తోంది. ఈఏడాది మార్చి 17 నుంచి 30వ తేదీ వరకు తొలి విడత సర్వే నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చేపట్టిన రెండో విడతలో జగిత్యాల జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఐదు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది సర్వే చేస్తారు. 735 మంది ఆశ కార్య కర్తలు, 247 మంది వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, సూపర్వైజర్లు సర్వే చేయనున్నారు. ప్రస్తుతం చర్మంపై మచ్చలు కనిపించినా, కాళ్లు, చేతులు చచ్చుబడినా వైద్యుల ను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించు కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంపై స్వర్శలేని మచ్చలు, నరాలవాపు, నొప్పితెలియని పుండ్లు, ముఖంపై గుళ్లలు, చేతులు, పాదాల తిమ్మిర్ల వంటి లక్షణాలు కనిపిస్తే కుష్టుగా అనుమానిస్తారు.
వ్యాధి లక్షణాలు:
చర్మంపై స్పర్శలేని రాగిరంగు మచ్చలు. చెవు లపై బుడిపెలు, కణితులు, నరాల తిమ్మిర్లు.
మందమైన మెరిసే జిడ్డుగల చర్మం
కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం,
కనురెప్పలు మూతపడకపోవడం,
సర్వేకు సహకరించాలి:
కుష్టు రహిత ఉన్నతమైన సమాజం కోసం చేస్తున్న సర్వేకు ప్రజలు సహకరించాలి. వైద్యసిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు శరీరంపై మచ్చలు చూపించాలి. కుష్ఠు మచ్చలుగా అను మానిస్తే పరీక్షలు చేయించి, నిర్ధారిస్తారు. ఇలాంటివారి వివరాలు గోప్యంగా ఉంచి,
చేతులు, కాళ్లలో బొబ్బలు రావడం,
చేతి, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం,
కాళ్ల చెప్పులు జారిపోవడం,
చల్లని, వేడివస్తువులు గుర్తించకపోవడం,
పాదాలు, మడమల్లో వాపు రావడం,
ముక్కుదిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, చికిత్స విధానం,
కుష్టు నివారణకు రెండు పద్దతుల్లో చికిత్స అంది స్తారు. శరీరంపై మూడు మచ్చలు ఉన్నవారికి పాసి వ్బ్యాసిలరీ(పీబీ) విధానంలో ఆరు నెలల పాటు చికిత్స అందిస్తారు. ఐదు మచ్చలకు పైబడి ఉన్నవా రికి మల్టీబ్యాసిలరీ(ఎంబీ) విధానంలో చికిత్స చేస్తారు. ఇందులో భాగంగా నెలకు ఒకసారి మందులను పేషెంట్ల ఇళ్లకు వెళ్లి వైద్య సిబ్బంది అందిస్తారు. సర్వేలో గుర్తించిన బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందజేయడంతోపాటు ఆ వ్యాధిపై అవగాహన కల్పిస్తారు. బహుళ ఔషధ చికిత్స(మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా వ్యాధిని అరికడుతున్నారు. బాధితులకు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తున్నారు.
12 నెలల పాటు చికిత్స:
మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మక్రిమితో కుష్టు సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా చర్మం, నరాలకు సోకుతుంది. లక్షణా లు బహిర్గతమయ్యేందుకు సగటున 3ఏళ్ల నుంచి 5ఏళ్ల సమయం పడుతుంది. వ్యాధి ఎవరికైన రావచ్చు. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. బహుళ ఔషధ చికిత్సతో తీవ్రతనుబట్టి 6నెలల నుంచి 12 నెలల్లో పూర్తిగా నయం చేసుకోవచ్చు.
మందులు ఉచితం:
ఈనెల 18వ తేదీ నుంచి వైద్యసిబ్బంది ఇంటింటా లెప్రసీ సర్వే చేస్తారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు వారికి సహకరించాలి. మచ్చలు ఉంటే వారు పరిశీలిస్తారు. గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఉంటే సిబ్బందికి చూపించాలి. వ్యాధి ఉన్నట్లు గుర్తిస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత మందులు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎన్ శ్రీనివాస్, డాక్టర్ ఏ శ్రీనివాస్ ,డాక్టర్ అర్చన, ఏ ఎం ఓ సత్యనారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్, తరాల శంకర్, హెచ్ ఓ రాజేశం, శ్రీధర్, సూపర్వైజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు