2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: ‘ఆస్క్ కవిత’ సెషన్‌లో కల్వకుంట్ల కవిత ప్రకటన

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వచ్చే 2029 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సోమవారం ‘ఆస్క్ కవిత’ పేరుతో ఎక్స్‌ (X) వేదికగా నెటిజన్లతో చాట్ చేస్తూ, ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వ్యాఖ్య చేశారు. రానున్న ఎన్నికల్లో తాను ఖచ్చితంగా బరిలోకి దిగుతానని చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

అయితే, 2029లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ జమిలి ఎన్నికలు గనుక వస్తే శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతాయి. తాను ఏ నియోజకవర్గం నుంచి, ఏ ఎన్నికల్లో బరిలోకి దిగుతానన్న విషయంపై కవిత ఈ సందర్భంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

గతంలో కవిత నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిచి, మరొకసారి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురికావడంతో, ఆమె ఏ పార్టీ తరఫున, ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న దానిపై బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *