

తేది:15-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల మున్సిపల్ పరిధిలో రాత్రే కాకుండా ఉదయం ఫ్లడ్ లైట్స్ వెలుగుతున్నాయని, జగిత్యాల మున్సిపల్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవాట్లేదని, అనవసరంగా విద్యుత్తు వృదా చేస్తున్నారని జగిత్యాల జిల్లా ప్రజలు వాపోతున్నారు. జగిత్యాల పాత బస్టాండ్ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఉన్న ఫ్లడ్ లైట్స్ ఈ రోజు 15/12/25, సోమవారం ఉదయం 8.30 ఐన ఇంకా అలాగే వెలుగుతున్నాయి. రాత్రే కాకుండా ఉదయం ఫ్లడ్ లైట్స్ వేస్తున్నారని, విద్యుత్తు వృదా చేస్తున్నారని, తక్షణమే చర్యలు తీసుకోవాలని జగిత్యాల ప్రజలు కోరుతున్నారు.