డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్: మన పంట.. మన వంట.. మన ఆరోగ్యం పేరుతో దుకాణాల కేటాయింపు

డ్వాక్రా సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, విజయనగరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) మరియు జిల్లా సమాఖ్యలు కలిసి ‘మన పంట.. మన వంట.. మన ఆరోగ్యం’ పేరుతో డ్వాక్రా మహిళలకు దుకాణాలు/మార్టులు కేటాయిస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే మహిళలకు రుణాలు అందించడమే కాకుండా, వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు.

ఈ దుకాణాలలో అన్ని రకాల సరుకులు దొరికేలా చర్యలు తీసుకున్నారు. డ్వాక్రా సంఘాలు అందించే డబ్బుతో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ మార్టులు మరియు దుకాణాలలో 15 నుంచి 18 మంది డ్వాక్రా మహిళలను ఉద్యోగులుగా నియమించారు. వీరికి ప్రతి నెలా రూ. 6 వేల నుంచి రూ. 12 వేల వరకు వేతనం చెల్లిస్తున్నట్లు విజయనగరం జిల్లా డీఆర్డీఏ అధికారులు తెలిపారు. అవసరమైతే అదనంగా మరికొంతమందిని కూడా ఉపయోగించుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ మార్టులు, దుకాణాల ద్వారా రోజుకు రూ. 60 వేల వరకు వ్యాపారం జరుగుతోందని అధికారులు వెల్లడించారు. విక్రయాలు మరింత పెంచేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే విజయనగరం కార్పొరేషన్ పరిధిలో నాలుగు మినీ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటికి తోడుగా మెగా మార్టులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ చర్యలన్నీ డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించి, మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *