నకిలీ మద్యం కేసు: తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌ఛార్జ్ జయచంద్రారెడ్డి అరెస్ట్?

నకిలీ మద్యం కేసు దర్యాప్తులో భాగంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌ఛార్జి జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అందిన సమాచారం మేరకు, ఎక్సైజ్ పోలీసులు బెంగళూరులో ఉన్న జయచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకుని, తంబళ్లపల్లికి తీసుకువచ్చినట్లు తెలిసింది. ములకలచెరువు మద్యం కేసులో ఆయన ‘ఏ-17’ (A-17) నిందితుడిగా ఉన్నారు.

గత కొన్ని నెలల నుంచి జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయకపోవడంపై రాజకీయ వర్గాల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా, ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో వైఎస్ జగన్ సైతం జయచంద్రారెడ్డిని ఇప్పటివరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు చర్యలు చేపట్టి, ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

బెంగళూరులో అరెస్ట్ చేసిన అనంతరం జయచంద్రారెడ్డిని తంబళ్లపల్లికి తీసుకు వచ్చి విచారిస్తున్నారని సమాచారం. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేయడంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *