గ్లోబల్ సమ్మిట్‌లో భట్టి విక్రమార్క: 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి PPP మోడల్ అనివార్యం!

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గ్లోబల్ సమ్మిట్‌లో జరిగిన ‘ఇన్నోవేటివ్ పీపీపీఎస్ (PPPలు): పబ్లిక్ గూడ్స్ కోసం ప్రైవేట్ క్యాపిటల్‌ను ఉపయోగించడం’ అనే చర్చా గోష్టిలో పాల్గొన్నారు. 3 ట్రిలియన్ అమెరికా డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్ అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం USD 200 బిలియన్ GSDP ఉన్న తెలంగాణ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సంవత్సరానికి USD 30 బిలియన్ పెట్టుబడి లోటును పూడ్చాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ పెట్టుబడి లోటును పూడ్చేందుకు CURE (Core Urban), PURE (Peri-Urban), RARE (Rural Agri) జోన్‌ల అభివృద్ధికి PPPలే ఇంధనంలా పనిచేస్తాయని డిప్యూటీ సీఎం వివరించారు. PPPల ద్వారా మెట్రోలు, సోలార్ పార్కులు, స్కిల్ హబ్‌లు వంటి రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు మార్గం వేస్తూ, మానవాభివృద్ధి మరియు నెట్-జీరో లక్ష్యాలకు ప్రభుత్వ నిధులను కేటాయించే అవకాశం లభిస్తుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ను ప్రైవేట్ భాగస్వాములు రికార్డు సమయంలో నిర్మించిన ఉదాహరణను ఆయన ప్రస్తావించారు.

పెట్టుబడులకు హైదరాబాద్‌ను స్వర్గధామంగా అభివర్ణించిన భట్టి విక్రమార్క, రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం, తక్కువ ధరకు నైపుణ్యం కలిగిన కార్మికులు, శాంతి భద్రతలు మరియు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వంటి అనేక సానుకూల అంశాలు ఉన్నాయని వివరించారు. పెట్టుబడిదారులను రాష్ట్ర ప్రభుత్వం తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుందని, రండి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టండి, కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *