నేషనల్ క్రష్ రష్మిక మందానా ప్రస్తుతం తన సినీ కెరీర్లో అత్యున్నత దశలో ఉన్నారు. వరుస హిట్లు, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లలో భారీ ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆమె ఒక బయోపిక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘భీష్మ’ సినిమా బ్లాక్బస్టర్ కావడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్పై అంచనాలు పెరిగాయి.
వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక చేయనున్న ఈ బయోపిక్.. చిన్న వయసులోనే మరణించిన దివంగత నటి ప్రత్యూష జీవిత కథ ఆధారంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. భువనగిరికి చెందిన ప్రత్యూష 17 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, 1998 నుంచి 2002 వరకు తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ‘రాయుడు’, ‘శ్రీరాములయ్య’, ‘సముద్రం’ వంటి చిత్రాలలో నటించింది. కేవలం 20 ఏళ్ల వయసులోనే 2002 ఫిబ్రవరి 23న ఆమె అకాల మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.
రష్మిక ఇప్పటికే ఈ కథను విన్నారని, ఈ ఛాలెంజింగ్ పాత్రలో నటించడానికి దాదాపు అంగీకరించారని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రష్మిక లాంటి టాప్ హీరోయిన్ ఇలాంటి సున్నితమైన, భావోద్వేగంతో కూడిన పాత్రను పోషిస్తే అది ఆమె కెరీర్కు ప్లస్ అవుతుందని కొందరు అభిప్రాయపడుతుండగా, కెరీర్ పీక్ స్టేజ్లో ఇలాంటి రిస్క్ తీసుకోవడం సరైనదేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ బయోపిక్ గురించి, రష్మిక నటిస్తున్న విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు స్పష్టత రావాల్సి ఉంది.