ఏఐ దుర్వినియోగంపై రష్మిక మందన్న ఆగ్రహం: మహిళలను లక్ష్యంగా చేసుకుంటే కఠిన శిక్ష విధించాలి!

ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన్న (Rashmika Mandanna), ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) దుర్వినియోగంపై తీవ్రంగా స్పందించారు. నటనతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకునే ఈ నటి, తాజాగా ఏఐ వాడకంపై చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవల ఆమె ‘పుష్ప’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారింది.

“ఏఐని అభివృద్ధి కోసం కాకుండా కొందరు అశ్లీలతను సృష్టించడానికి, మహిళలను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగం చేస్తున్నారు” అని రష్మిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చింది. ఏఐని మంచి కోసం మాత్రమే వాడుకుందామని, ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేసింది. ఏఐ సాంకేతికతను బాధ్యతగా ఉపయోగించాలని, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చింది.

రష్మిక మందన్న ఈ విధంగా స్పందించడం డిజిటల్ ఎథిక్స్ మరియు మహిళా భద్రతపై పెరుగుతున్న ఆందోళనను ప్రతిబింబిస్తోంది. స్టార్‌డమ్‌లో ఉన్న ఈ నటి, ఇలాంటి సున్నితమైన అంశంపై గళం విప్పడం పట్ల ఆమె అభిమానులు మరియు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *